నరేష్ – పవిత్ర ల పరిచయం అక్కడి నుంచే మొదలయిందా..?

-

గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నరేష్ – పవిత్రాల మధ్య సాగే బంధం బాగా వైరల్ గా మారుతుంది. ఇక వీరిద్దరూ నిజంగానే సహజీవనం చేస్తున్నారా లేక స్నేహితులా.. లేదా పెళ్లి చేసుకోబోతున్నారా అనే విషయం ఎవరికీ తెలియక సర్వత్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఇక వీరిద్దరి మధ్యలోకి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి జోక్యం చేసుకోవడం మరింత హాట్ టాపిక్ గా మారింది. మరి నరేష్ పవిత్రాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాలలో నటించడం.. అంతేకాదు నరేష్ నటించిన ప్రతి సినిమాలో కూడా పవిత్ర ఉండేలాగా నరేష్ చేస్తూ ఉండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది.

ఇక వీరిద్దరూ ఎక్కువ సినిమాలలో నటిస్తూ ఉండడం కారణంగా బయట కూడా కలిసి తిరుగుతూ ఉండడంతో నిజంగానే వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. నిజానికీ వీరిద్దరి మధ్య పరిచయం ఎక్కడ మొదలైంది అనే విషయం కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక అసలు విషయం ఏమిటో మనం కూడా చదివి తెలుసుకుందాం. ఇకపోతే నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి నరేష్ కు దూరమైన తర్వాత ఆయన ఇబ్బందుల్లో వుండి, మానసికంగా క్షోభకు గురి అవుతున్న సమయంలో పవిత్ర దగ్గర అయినట్లు సమాచారం.

వీరిద్దరూ ఎన్నో సినిమాలలో కలిసి నటించినప్పటికీ 2018లో వచ్చిన ఒక సినిమా వీరిద్దరి మధ్య మరింత బాంటింగ్ బలపడడానికి కారణం అయ్యింది. 2018లో సమ్మోహనం సినిమా ద్వారా నరేష్, పవిత్ర ఇద్దరు కలిసి నటించారు. మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా నటించిగా.. సుధీర్ తల్లిదండ్రులుగా నరేష్ – పవిత్ర లోకేష్ నటించడం జరిగింది. ఇకపోతే ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే సమ్మోహనం సినిమా తర్వాత కూడా వీరిద్దరూ ఎన్నో సినిమాలలో కలిసి నటించడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news