క్రికెట్ కు దినేష్ కార్తీక్ రిటైర్మెంట్ ?

-

దినేష్ కార్తీక్ ఇక తన క్రికెట్ కెరీర్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2022లో ఆడుతున్న డీకే, ఈ మెగా టోర్నీ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సమాచారం. 2004లోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన డీకే 18 ఏళ్ల కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.

2007లో సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ఆ విన్నింగ్ టీం లో డీకే కూడా సభ్యుడే. అలాగే 2018 లో నిదాస్ ట్రోఫీ సందర్భంగా బంగ్లాదేశ్ పై ఆడిన ఇన్నింగ్స్ దినేష్ కార్తీక్ కెరీర్ లోనే బెస్ట్ ఇన్నింగ్స్ గా నిలిచింది. ఒంటి చేత్తో టీమ్ ఇండియాను గెలిపించి, విజేతగా నిలిపిన ఆ మ్యాచ్ ఒక విధంగా డీకే కెరీర్ ను పూర్తిగా మార్చేసిందనే చెప్పాలి. అయితే.. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ లో దినేష్ కార్తీక్ గాయపడ్డాడు. దీంతో… రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఏజ్‌ బార్‌ కావడంతో..ఈ నిర్ణయం తీసుకోబోతున్నాడని టాక్‌ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news