ఏపీ బీజేపీలో అసమ్మతి.. సోము వీర్రాజుపై ఫిర్యాదు

-

ఏపీ బీజేపీలో అసమ్మతి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి వెళ్లారు ఏపి బిజేపి అసమ్మతి నాయకులు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఏపి బిజేపి ఇంచార్జ్ తో రాష్ట్ర పార్టీ అసమ్మతి నేతల సమావేశం జరుగనుంది. ఏపి బిజేపి ఇంచార్జ్ మురళీధరన్ తో మధ్యాహ్నాం 2 గంటలకు సమావేశమౌతున్నారు ఏపి బిజేపి అసమ్మతి నేతలు. మురళీధరన్ నివాసంలో ఈ సమావేశం జరుగనుంది.

ఏపి బిజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహారం శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నేతలు… ఢిల్లీ కి వచ్చారు పలు జిల్లాల బిజేపి మాజీ అధ్యక్షులు, గతంలో వివిధ స్థాయుల్లో పార్టీకి పని చేసిన నేతలు. ఏపి బిజేపి నాయకత్వాన్ని మార్చాలని అసమ్మతి నేతలు కోరుతున్నారు. కాగా, ఏపి బిజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహారం శైలి నచ్చకే… టీడీపీ పార్టీలోకి కన్నా లక్ష్మీ నారాయణ వెళుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news