ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీలో పాములు పుట్ట పెట్టాయి – దివ్యవాణి

-

ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీలో పాములు పుట్ట పెట్టాయని సినీనటి దివ్యవాణి విమర్శలు చేశారు. ఎన్టీఆర్‌పై అభిమానంతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ తన కొడుక్కి ఎన్టీఆర్‌ పేరు పెట్టారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పటికీ ఎన్టీఆర్‌పై అభిమానంతో మాట్లాడుతుంటారని తెలిపారు సినీనటి దివ్యవాణి.

అటువంటి ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీలో పాములు పుట్ట పెట్టాయి. వాటిని పిల్లల దశలోనే చంపకపోతే అందర్నీ కాటేస్తాయనే ఆవేదనతో గుండె పగిలి టీడీపీకి రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. టీడీపీలో ఉన్నందుకు వచ్చిన సినిమా అవకాశాలు కూడా పోయాయని… నా నోటికాడ భోజనం పోయిందని వెల్లడించారు. అది కూడా నేను ఎవరికీ చెప్పుకోలేదు. నా సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుని పార్టీకోసం పనిచేశారని పేర్కొన్నారు సినీనటి దివ్యవాణి.

పిచ్చిదానిలా టీడీపీలో చేరతావా? వైఎస్సార్‌సీపీలో అయితే బాగుంటుంది. వైఎస్సార్‌సీపీలో నమ్మినవారికి ద్రోహం జరగదని ఎంతోమంది శ్రేయోభిలాషులు చెప్పినా వినకుండా టీడీపీలో చేరానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news