తెలంగాణ కోసం ఏం పీకినవో చెప్పు…సిగ్గు శరం లేదు : కేసీఆర్ పై డీకే అరుణ ఫైర్

-

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్‌ అయ్యారు. తెలంగాణ కోసం ఏం పీకినవో చెప్పు…సిగ్గు శరం లేదా అంటూ సీఎం కేసీఆర్‌పై డీకే అరుణ నిప్పులు చెరిగారు. అవినీతి సామ్రాట్ నీవు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై మాట్లాడే స్థాయి నీకు లేదు.. అంటూ కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 వందల పిల్లల ప్రాణాలు తీసుకుని ఆ సీట్లో కూర్చున్నావని మండిపడ్డారు. కొంచం అన్నా సిగ్గు శరం లేదన్నారు.

నీ ఆలోచనే దోపిడీ … దోపిడీ దారుడవు… కేంద్ర బడ్జెట్ ని జీర్ణించుకోలేక మాట్లాడావని కేసీఆర్ పై ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు డీకే అరుణ. నీవి ముదనష్టపు ఆలోచనలు.. పిచ్చి లేసి పిచ్చి కుక్క లెక్క మాట్లాడారని.. కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. నిన్నటి బడ్జెట్ దేశం కోసం పెట్టిందన్నారు. నీ అవినీతి సొమ్మును ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడకు పంపుతున్నావని కేసీఆర్ పై డీకే అరుణ సంచలన ఆరోపణలు చేశారు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. జైలు కు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news