ప్రముఖ డాక్టర్ హత్య.. సీసీటీవీలు పైకి తిప్పి మరీ !

-

కృష్ణాజిల్లా అవనిగడ్డలో ప్రముఖ వైద్యులు డా.కోట శ్రీహరిరావు హత్యకు గురయ్యారు. ఆయన స్వగృహంలో బెడ్ రూమ్ లో రక్తపు మడుగులో ఆయన ఉన్న మృతదేహం పడి ఉంది. అత్యంత తెలివిగా సీసీటీవీ కెమెరాలలో సైతం కనిపించకుండా కెమెరాలను పైకి తిప్పినట్టు గుర్తించారు. కుటుంబ  సభ్యులు ఎవరు ఇంట్లో లేని సమయంలో జరగడంతో అనుమానిత హత్య అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు.

murder
murder

హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పరిశీలించారు. సంఘటనా ప్రాంతానికి చేరుకున్న క్లూస్ టీం సిబ్బంది కీలక వివరాలు సేకరించింది. 4 బృందాలతో ఈ హత్య కేసు దర్యాప్తు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఆయన అన్నారు. సమీప బంధువులను, కుటుంబ సభ్యులను, ఆస్పత్రి సిబ్బందిని , స్థానికులను, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది విచారిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news