జనసేన పార్టీకి ఒక విధానం ఉందా? – బొత్స

-

ఎయిర్ పోర్టు ఘటనపై స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఎయిర్పోర్టు ఘటనను చంద్రబాబు ఖండించాల్సింది పోయి నిందితులపై చర్యలు తీసుకోవడం తప్పంటారా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలు బాగుపడితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు సహించలేకపోతున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీకి ఓ విధానం ఉందా? అసలు పవన్ కళ్యాణ్ ది రాజకీయ పార్టీయేనా? ప్రశ్నించారు.

విశాఖ రాజధాని ఎందుకు వద్దో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జనసేన రాజకీయ పార్టీ కాదు.. జనసేన ఓ సెలబ్రిటీకి చెందిన పార్టీ అని అన్నారు. రాజధానికి విశాఖ దోహదపడుతుందని తెలిసి కూడా విషం కక్కుతున్నారని ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు. విశాఖ రాజధాని వద్దనే వాళ్లు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలన్నారు. టిడిపి, జనసేన పార్టీలు కూడా తమ వైఖరిని మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. విశాఖకు రాజధాని వచ్చి తీయడం ఖాయమని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news