అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డి పరిస్థితి అధ్వానంగా తయారైంది – మంత్రి ఎర్రబెల్లి

-

బిజెపికి అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి అధ్వానంగా తయారైందని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నల్గొండ జిల్లా చండూరు మునిసిపాలిటీలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా మంత్రి ఎర్రబెల్లి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీల గురించి ప్రజలు ఆయనని నిలదీస్తున్నారని అన్నారు.

కేంద్ర మంత్రి అమిత్ షాతో కొట్లాడి ఈ ప్రాంతానికి నిధులు తీసుకువచ్చి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్దాల మంత్రి అయ్యారని విమర్శించారు. మంత్రి కేటీఆర్ మునుగోడుని దత్తత తీసుకుంటానని చెప్పగానే నియోజకవర్గంలోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అన్ని సర్వేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అనుకూలంగా వచ్చాయని స్పష్టం చేశారు. బూర నర్సయ్య గౌడ్ ది ఈ నియోజకవర్గమే కాదని.. మరి ఆయనకి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news