పంజాబ్ లో డ్రోన్‌ కలకలం.. 3 కిలోల హెరాయిన్‌ సీజ్

-

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ సెక్టార్‌లో ఓ డ్రోన్ కలకలం సృష్టించింది. ఆ డ్రోన్ లో ఆయుధాలు, డ్రగ్స్‌ ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ఫిరోజ్‌పూర్‌ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ వైపు నుంచి వస్తున్న డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్‌ దళాలు గర్తించాయి.

దీంతో కాల్పులు జరిపి డ్రోన్‌ను అడ్డుకున్నారు. ఘటనా స్థలంలో 3 కిలోల హెరాయిన్‌, చైనాలో తయారైన తుపాకీ, బుల్లెట్లు, మ్యాగజైన్‌ లభించాయి. దీంతో వ్యాటిని సీజ్‌చేశారు. ఈ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశారు. ఈ కన్‌సైన్‌మెంటును ఎక్కడికి తరలిస్తున్నారనే విషయమై ఆరాతీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news