ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం

-

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 1.50 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. ఉత్తర కాశీకి 24 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 5 కిలో మీటర్ల లోతులు కదలికలు సంభవించాయని చెప్పింది. క అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ఇళ్లలో గాఢ నిద్రలో ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. అయోమయంలో ఆ నిద్రలోనే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

 

మరోవైపు.. నేపాల్‌లో కూడా భూమి కంపించింది. ఆదివారం రాత్రి 10.53 గంటలకు ధాడింగ్‌ జిల్లాలో 4.5 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేపాల్‌ ఎర్త్‌క్వేక్‌ మానిటరింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ తెలిపింది. కఠ్‌మండూకు 50 కిలోమీట్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news