మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజ్ గోపాల్ రెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసులు

-

మునుగోడు ఉప ఎన్నికకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో…మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజ్ గోపాల్ రెడ్డికి తాజాగా ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది.

టీఆర్‌ఎస్ నేత సోము భరత్ కుమార్ ఫిర్యాదుతో స్పందించిన ఈసీ..ఈ మేరకు రాజ్ గోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కంపెనీ ఖాతాల నుంచి 5 కోట్ల 24 లక్షల రూపాయలు ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారో వివరాలు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం. ఇవాళ సాయంత్రం 4 గంటల లోపు వివరణ ఇవ్వాలంటూ రాజ్ గోపాల్ రెడ్డికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మరి దీనిపై కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news