మతం పేరుతో ఎన్కౌంటర్లు చేస్తున్నారు – అసదుద్దీన్ ఓవైసీ

-

ఉత్తరప్రదేశ్ లో గ్యాంగ్ స్టార్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ ని ఎదురుకాల్పుల్లో పోలీసులు హతమార్చారు. కాగా అతని వద్ద నుండి విదేశీ తయారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్ యూపీ ఝాన్సీ వద్ద జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మరణించారు. అసద్ అహ్మద్, గులామ్ లను పోలీసులు హతమార్చారు.

ప్రయాగ్రాజ్ లో జరిగిన ఓ మర్డర్ కేసులో ఈ ఇద్దరు మోస్ట్ వాంటెడ్ నిందితులు. అలాగే ఉమేష్ పాల్ మర్డర్ కేసులో అసద్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎన్కౌంటర్ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. బిజెపి ఎన్కౌంటర్లు నిర్వహిస్తోందని మండిపడ్డారు. మతం పేరుతో ఎన్కౌంటర్లు చేస్తున్నారని విమర్శించారు. బుల్లెట్లతో న్యాయం చేస్తామని నిర్ణయించినప్పుడు.. ఇక న్యాయస్థానాలు ఎందుకని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version