ICC Womens T20 World Cup 2023 : టీమిండియాకు బిగ్ షాక్

-

టీమిండియా మహిళల జట్టుకు బిగ్ షాక్. మహిళల టీ20 ప్రపంచ కప్ లో భారత జోరుకు ఇంగ్లాండ్ బ్రేక్ లేసింది. గ్రూప్-2లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్ లో హర్మాన్ ప్రీత్ సేన 11 పరుగుల తేడా తో ఓడింది. ఇంగ్లాండ్ ఈ మెగా టోర్నీలో ‘హ్యాట్రిక్’ విజయాలతో సెమీస్ బెర్త్ ను దాదాపు కాయం చేసుకుంది. ముందుగా ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది.

రేణుక సింగ్ అద్భుతమైన బౌలింగ్ తో టాపార్డర్ బ్యాటర్లను బెంబేలెత్తించింది. సీవర్ బ్రాంట్, ఆఖరిలో ఆమీ జోన్స్ రాణించడంతో ఇంగ్లాండ్ పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 140 పరుగులే చేసింది. ఆరంభంలో ఓపెనర్ స్మృతి మందాన, ఆఖరిదాక రిచా ఘోష్ పోరాడారు. కానీ మిగతా బ్యాటర్లు షాఫాలీ, జమీమా, హర్మన్ ప్రీత్, దీప్తిశర్మల వైఫల్యంతో జట్టు ఓడింది.

Read more RELATED
Recommended to you

Latest news