అలరిస్తున్న ప్రభాస్, గోపీచంద్ అన్ స్టాపబుల్ ప్రోమో..

-

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపబుల్ సీజన్ 2 ఎంతగా ఆదరణ పొందిందో అందరికీ తెలిసిందే.. తాజాగా ఈ షోకు హీరో ప్రభాస్, గోపీచంద్ వచ్చారు.. వీరిద్దరూ ఎప్పటినుంచో మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే.. అయితే తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో అందర్నీ అలరిస్తుంది..

 

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కు వచ్చిన హీరో ప్రభాస్, గోపీచంద్ రచ్చ చేశారు బాలకృష్ణ తో కలిసి కామెడీని పండించారు ఈ సందర్భంగా ఒకరి మీద ఒకరు పంచులు వేసుకుంటూ ప్రేక్షకుల్ని నవ్వించారు అయితే ఈ సందర్భంగా పలు విషయాలు చర్చించుకుంటున్నట్టు తెలుస్తుంది.. బాలకృష్ణ వీరిద్దరిని 2008లో మీరిద్దరూ ఒక హీరోయిన్ కోసం గొడవపడినట్టు తెలిసింది. అయితే ఆ హీరోయిన్ ఎవరు అంటూ ప్రశ్నించగా వెంటనే ప్రభాస్ నాకైతే ఏం తెలియదు. గోపి ఏమైనా చేసాడేమో అడగండి అంటూ నవ్వేసాడు.. అలాగే గోపీచంద్ ప్రభాస్ నాకు రాణి కోసం ఓ విషయం చెప్పాడు అంటూ నవ్వగా అది ఎవరో కూడా నువ్వే చెప్పు.. లేదంటే ఇది చూస్తున్న మా అమ్మ కంగారు పడిపోతుంది అంటూ నవ్వులు పూయించాడు ప్రభాస్..

అలాగే ఓ ఫోటోను చూపిస్తూ ఇది ఎక్కడ అని బాలకృష్ణ ప్రశ్నించగా.. వెంటనే ప్రభాస్ నువ్వు చెప్పు నువ్వు చెప్పు అంటూ గోపీచంద్ను కంగారు పెట్టారు.. అలాగే ఈ రోజుల్లో ఏం చేసిన సోషల్ మీడియా ఆడేసుకుంటుంది సార్ అంటూ ప్రభాస్ అనగా.. మరి మేము ఆ రోజుల్లో సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేసే వాళ్ళము తెలుసా అంటూ బాలకృష్ణ నవ్వులు పండించారు.. అలాగే తనకు వర్షం సినిమా లైఫ్ ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చారు గోపీచంద్.. ఈ సందర్భంగా ప్రభాస్ దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజును గుర్తు చేసుకున్నారు ఇంటికి శత్రువు వచ్చినా మర్యాదగా అన్ని చేసి పంపించే వారని ఏదైనా ఉంటే బయట చూసుకుందాం అంటూ చెప్పావారని.. నా ఫేవరెట్ స్టార్ హీరో అతనే అంటూ ప్రభాస్ ఎమోషనల్ అయ్యారు.. అయితే ప్రస్తుతం వచ్చిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రోమనే ఇలా ఉంటే షో ఇంకా ఎలా ఉంటుందో అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news