సీఎం‌ కేసీఆర్ వి అన్నీ దొంగ స్కీంలే : ఈటల ఫైర్

-

సిఎం కెసిఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ప్రజలను వంచించటానికి సీఎం‌ కేసీఆర్ అన్ని దొంగ స్కీంలను తీసుకొస్తాడని అగ్రహించారు. దళితబంధు మాదిరి గిరిజనబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈటల. నవంబర్ 4 న దళితబంధు అమలు చేస్తామన్న కేసీఆర్ మాటలు ఒట్టి మాటలు అని అగ్రహించారు.

రిజర్వేషన్లను అడ్డుకుని గిరిజనుల కళ్ళల్లో మట్టికొట్టిన‌ వ్యక్తి సీఎం కేసీఆర్ అన్బి ఫైర్ అయ్యారు. మూడెకరాల భూమి దేవుడెరుగు.. సాగుచేసుకుంటోన్న పోడు భూములను లాక్కుంటున్నాడని మండిపడ్డారు.

ధరణి పోర్టల్ వలన సొంత భూముల‌ మీద హక్కులు కోల్పోతున్నామనీ.. సమాజంలో అత్యంత వెనుకబడిన వారు హరిజనులు, గిరిజనులు అని పేర్కొన్నారు. కేసీఆర్ మాటలు గొప్పగా ఉంటాయి…. అచరణకు మాత్రం నోచుకోవని.. తెలంగాణ వస్తే గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఏమైంది ? అని నిలదీశారు. గిరిజన విద్యార్థులకు పాత బకాయిలు, మెస్ ఛార్జీలు వెంటనే రిలీజ్ చేయాలని.. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో కేసీఆర్ చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news