రైతులు ఏమైనా టెర్రరిస్టులా..?: ఈటల రాజేందర్‌

-

రైతులు ఏమైనా టెర్రరిస్టులా.. దీక్ష చేస్తూ ఉంటే పోలీసులు లాఠీ దెబ్బలు కొట్ట‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించారు హుజురాబాద్ నియోజ‌క‌వర్గ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇవాళ ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ప్రభుత్వం కల్పించాలని.. 18 సంవత్సరాలు నిండిన యువకులకు 8 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్.

వ్యవసాయ భూముల అభివృద్ధి కోసం ప్రభుత్వం రైతులకు డబ్బులు చెల్లించాలన్నారు. లక్షలాది మందికి అవకాశం కల్పించే గూడటిపల్లి ప్రజలు న్యాయమైన డిమాండ్ల కోసం డిమాండ్ చేస్తే పోలీసులతో దౌర్జన్యం చేస్తూ రక్తపాతం సృష్టించడం దుర్మార్గం మైనా చర్య అని నిప్పులు చెరిగారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతోకాలం ఉండదని గ్రహించు కోండి ఇక కేసీఆర్ కాలం చెల్లదు గుర్తుంచుకోవాలని హెచ్చ‌రించారు. పూర్తి స్థాయి పరిహారం అందించే వరకు రైతుల పక్షాన బిజెపి అండగా ఉంటుందని చెప్పారు ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Latest news