కేసీఆర్ ఫాంహౌజ్ లో చ‌నిపోయిన వ్య‌క్తి కుటుంబానికి ఈట‌ల ఆర్థిక సాయం

-

కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రమాద వశాత్తు మృతి చెందిన ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించారు హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్‌. ఈ సంద‌ర్భంగా బాధిత కుటుంబానికి యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈటెల‌. ఈ సంద‌ర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… మత్సకార కుటుంబంలో పుట్టి, ఐదు నిమిషాల పాటు నీటిలో మునిగి ఉండగలిగిన వ్యక్తి ఆంజనేయులు అని.. ఆంజనేయులు ఎలా చనిపోయాడో నిగ్గు తేల్చి, ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

నేడు పోలీస్ పహారతో కుటుంబాన్ని బెదిరించవచ్చు కానీ తెలంగాణ సమాజం ఎలా స్పందించాలో స్పందిస్తుంద‌ని.. హెచ్చ‌రించారు. ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి ఉంటే లాభం జరుగుతదని, స్వేచ్చ ఉంటదని,రక్షణ ఉంటదని భావించిన ప్రజలకు ఈ చర్య తెరిపించిందని పేర్కొన్నారు. ఈ ఫామ్ హౌస్ వచ్చిన తర్వాత స్వేచ్చ, లాభం దేవుడెరుగు కానీ వీళ్ళను పెట్టె హింస అంత ఇంత కాదని హెచ్చ‌రించారు. ఇంతకు ముందు పోలీస్ నిర్బందాన్ని చవిచూడని ఈ ప్రాంతం నిత్యం పోలీసుల దౌర్జన్యాన్ని చూడాల్సి వస్తుందని వెల్ల‌డించారు. కేవలం చావు ఖర్చుల కోసం యాభై వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం సిగ్గు చేటని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news