నేను గెలిస్తే కేసీఆర్ రోడ్డు మీదకు వస్తాడు..ఈటెల ఫైర్..!

-

మాజీ మంత్రి, బీజేపి నేత ఈటెల రాజేందర్ హుజూరాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ…తాను గెలిస్తే ఫామ్ హౌస్ లో ఉన్న కెసిఆర్ రోడ్డు మీదకు వస్తాడని అన్నారు. ఈటల రాజేందర్ ఎందుకు సిఎం కావొద్దన్న చర్చ జరిగిందని…అప్పటి నుండి తనను కేసీఆర్ కంట్లో పెట్టుకున్నాడని చెప్పారు. దళిత బంధు వద్దు అన్నాను అని ఇంకోటి పుట్టించారని…
అది తప్పు అని ఆంధ్రజ్యోతి లో వార్త కూడా వచ్చిందని ఈటెల స్పష్టం చేశారు.

etala
etala

నాకు నేనే నా మీద దాడి చేయించుకొని, కట్లు కట్టుకొని సానుభూతి పొందాలని చూస్తున్నా అని ఓ మంత్రి అంటున్నారని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు కూడా తూ అని మాట్లాడుతున్నా సిగ్గు రావడం లేదా ? అంటూ ఈటెల ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలంతా మూర్కులు అంటూ ఈటల మండి పడ్డారు. ఇదిలా ఉండగా హుజూరాబాద్ లో గెల్లు శ్రీనివాస్ తరపున హరీష్ రావు ప్రచారం లో దిగి ఈటల పై విమర్శలు కురిపిస్తూ.. టీఆర్ఎస్ విజయానికి కృషి చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news