కేసీఆర్‌ ను ఓడిస్తాననే ఛాలెంజ్ కి కట్టుబడి ఉన్నా – ఈటల రాజేందర్‌

-

కెసిఆర్ ను ఓడిస్తాననే ఛాలెంజ్ కి కట్టుబడి ఉన్నానని ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. కెసిఆర్ ను కొట్టగల దమ్ము ఈటల కు ఉందని ప్రజలు నమ్ముతున్నారు…గజ్వేల్ లో ప్రజలు నిన్ను బొంద పెట్టడానికి సిద్దంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పట్టిన శనిని పారదొలాలి… హుజూరాబాద్ ప్రజలకు చేతులెత్తి వేడుకుంటున్నానని చెప్పారు. నా భార్య ఆన్న మాటలకు సిగ్గు ఉన్న వాళ్ళు సచ్చిపోవాలి.. నా మీద భూ కుంభకోణం ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

దమ్ము ఉంటే అసెంబ్లీ రద్దు చెయ్యి అని.. మా అమిత్ షా చెప్పి పోయారు… మేము సిద్దంగా ఉన్నామని సవాల్‌ విసిరారు ఈటల రాజేందర్‌. కెసిఆర్ గతం లో కూడా ఇలానే మతి భ్రమించి మాట్లాడారు… బుల్లెట్ అర ఇంచు మాత్రమే ఉంటుంది గుండెల్లో గుచ్చుకుంటే సచ్చిపోతారని నిప్పులు చెరిగారు. నా మీద ఏ పార్టీ ఇప్పటి వరకు అనుచిత వ్యాఖ్యలు చేయలేదు..కెసిఆర్ లెక్క కు సంస్కారిని కాదు… అయన లా మాట్లాడదలచుకోలేదని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news