కెసిఆర్ దళితుల నోట్లో మట్టికొట్టాడు – ఈటెల రాజేందర్

-

సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. వరంగల్ బిజెపి పార్టీ ఆఫీసులో ఈటల రాజేందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కెసిఆర్ తెలంగణ సాధించడమే లక్ష్యం అని చెప్పారని, కాపలా కుక్కలాగా ఉంటా అన్నారని, తోలి ముఖ్య మంత్రి దలితున్ని చేస్తా అన్నారని కానీ మొదట దళితుల నోట్లో మట్టి కొట్టిందే కెసిఆర్ అని మండిపడ్డారు.

దలితున్ని ఉప ముఖ్యంత్రి పదవీ నుంచి తీసేశారని అన్నారు. కానీ కేంద్రంలో దళితులకు 12మందికి మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. తోలి దళిత రాష్ట్రపతినీ చేసింది మోడి అని పేర్కొన్నారు. 1.8 సంత్సరకాలంగా ఫస్ట్ ఫేస్ లో దళితులకు దళిత బంద్ అందలేదని ఆరోపించారు. ఎమ్మేల్యే బంధువులకు దళిత బంద్ ఇచ్చారని మండిపడ్డారు. అందరికి దళిత బంద్ ఇవ్వాలి అంటే 40సంత్సరాలు పడుతుందన్నారు. సీఎంఓ ఆఫీసులో ఒక్క దళిత ఆఫీసర్ కూడా లేడని అన్నారు ఈటెల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Latest news