రాజశ్యామల యాగం చేసినా కేసీఆర్ కు ఫలితం ఉండదు – బండి సంజయ్

-

నేడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర జగిత్యాల జిల్లా చల్గల్గ్ గ్రామం నుంచి ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో భాగంగా నేడు బండి సంజయ్ 18 కిలోమీటర్లు నడవనున్నారు. జగిత్యాల టౌన్, థరూర్, రాజారాం, తారక రామ్ నగర్, నూకలపల్లె, మల్యాల క్రాస్ రోడ్స్, ముత్యంపేట్ మీదుగా కొండగట్టు వరకు పాదయాత్ర సాగనుంది.

ఈ పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఢిల్లీలో సీఎం కేసీఆర్ రాజా శ్యామల యాగం చేసిన ఫలితం ఉండదన్నారు. కెసిఆర్ కుటుంబం అంతా జైలుకు క్యూ కట్టాల్సిందేనన్నారు బండి సంజయ్. ఆయన కుటుంబం అందరి పైన దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తాయని అన్నారు. అలాగే పాదయాత్రలో భాగంగా చల్గల్ గ్రామంలోని బీడీ ఫ్యాక్టరీని సందర్శించారు బండి సంజయ్. బీడీ కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version