ఐపీఎల్ లో కేన్ బ‌క‌రా అవుతాడు.. మాజీ క్రికెట‌ర్ వ‌సీం జాఫ‌ర్ సంచ‌ల‌నం

-

ఐపీఎల్ 2022 లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ కెన్ విలియ‌మ్స‌న్ బ‌క‌రా అవుతాడంటూ మాజీ క్రికెట‌ర్ వాసీం జాఫ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స‌న్ రైజ‌ర్స్ బ్యాటింగ్ ఆర్డ‌ర్ ఎంపిక చేయ‌డం కేన్ విలియ‌మ్స‌న్ కు క‌ష్ట‌మైన ప‌ని అన్నారు. రాహుల్ త్రిపాటి పూర‌న్, అభిషేక్ శ‌ర్మ, మార్క్ర‌మ్, గ్లెన్ పిలిప్స్, షెఫ‌ర్డ్ వంటి ఆట‌గాళ్ల జ‌ట్టులోకి రావ‌డంతో ఓపెనింగ్, తో పాటు మిడిల్ ఆర్డ‌ర్ లో బ్యాట్స్ మెన్ ఎంపిక చేయ‌డం క‌ష్టమైన ప‌ని అన్నారు.

ఒక వేళ కేన్ మామ త‌న మూడో స్థానాన్ని త్యాగం చేస్తే.. బ‌క‌రా అవ‌డం ఖాయమని అన్నారు. కానీ ప‌వ‌ర్ ప్లే లో ఎక్కువ ప‌రుగులు రాబ‌ట్టాల‌ని అనుకుంటే.. కేన్ విలియ‌మ్స‌న్ త‌న స్థానాన్ని త్యాగం చేయాల్సిందే న‌ని అన్నారు. అలాగే అభిషేక్ శ‌ర్మ ను ఓపెనర్ గా పంపించాల‌ని అన్నారు. అభిషేక్ శ‌ర్మ ఓపెనింగ్ లో వ‌స్తే.. మంచి ఫ‌లితం వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అన్నారు. కాగ స‌న్ రైజ‌ర్స్ కు ఓపెనింగ్ స‌మ‌స్య ఎక్కువ గానే ఉంది. రాహుల్ త్రిపాటి ఓపెనింగ్ చేసే స‌త్త ఉంది. అయితే త్రిపాటికి జోడీ ఎవ‌రు అనేదే ప్ర‌శ్న‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news