రేవంత్ ను బలహీనపరిచే కుట్ర జరుగుతోంది : అనిల్

-

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలోని అసమ్మతి నేతలపై ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఎరవత్రి అనిల్‌ స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీని, రేవంత్ రెడ్డిని బలహీనపర్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ నెల 26 నుంచి పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తుంటే.. పాదయాత్రను దెబ్బతీయాలని అసమ్మతి నేతలు చూస్తున్నారని ధ్వజమెత్తారు. ముసుగు వీరులంతా టైం చూసుకుని బయట పడ్డారని ధ్వజమెత్తారు.

గతంలో 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినప్పుడు ‘సేవ్ కాంగ్రెస్’ ఎందుకు గుర్తు రాలేదని అనిల్ మండిపడ్డారు. ఆనాడు పీసీసీగా ఉన్న వాళ్లు ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే ఉత్తమ్‌ ఏం చేశారని ప్రశ్నించారు. సీనియర్లు పార్టీ కోసం పని చేస్తే మునుగోడులో 50 వేల ఓట్లతో గెలిచే వాళ్లమని పేర్కొన్నారు.

“ముసుగువీరులు బయటకొచ్చారు. రేవంత్‌ చేసే పాదయాత్రను దెబ్బ తీయాలని చూస్తున్నారు. కాంగ్రెస్‌, రేవంత్‌ను బలహీనపరిచే కుట్ర జరుగుతోంది. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినప్పుడు ‘సేవ్ కాంగ్రెస్’ ఎందుకు గుర్తు రాలేదు? మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే ఉత్తమ్ ఏం చేశారు? సీనియర్లు పార్టీ కోసం పని చేస్తే మునుగోడులో గెలిచేది. సీఎల్పీ నేత భట్టికి కమిటీల సమాచారం లేదు అనేది అబద్ధం.” – ఎరవత్రి అనిల్‌, మాజీ ఎమ్మెల్యే

Read more RELATED
Recommended to you

Latest news