తెలంగాణలో పరీక్షలు మరింత లేట్ ?

-

డిగ్రీ, పీజీ,ఇంజినీరింగ్ పరీక్షల షెడ్యూల్, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ల షెడ్యూల్ పంపించాలని ఉన్నత విద్యా మండలిని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. దీంతో వెంటనే వివరాలు పంపించాలని ఆయా యూనివర్సిటీ లను ఉన్నత విద్యా మండలి కోరింది. యూనివర్సిటీల నుంచి వివరాలు రాగానే కన్సాలిడేటెడ్ చేసి విద్యా శాఖకు పంపించనుంది హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్.

డిగ్రీ ఫైనల్ ఇయర్ 5th సెమిస్టర్, ఇంజనీరింగ్ 7th సెమిస్టర్, పీజీ 3rd సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేసి చివరి సెమిస్టర్ క్లాసెస్ ప్రారంభించాలనే యోచనలో విద్యా శాఖ ఉన్నతు చెబుతున్నారు. అయితే కరోనాతో విద్యా సంస్థలను మూసి వేయడం తో మధ్యలోనే పరీక్షలు ఆగిపోయాయి.  పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై కూడా ప్రతిపాదనలు పంపించాలని ఆయా యూనివర్సిటీ లను ఉన్నత విద్యా మండలి కోరింది. అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు టైమ్ పెట్టె అవకాశం ఉందని, దీంతో పరీక్షలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news