డయాబెటిక్ రోగులకు అద్భుతమైన ఆహారం..!!

-

ముఖ్యంగా మన భారత దేశంలో చాలా మంది యువతీ యువకులు కూడా ఎక్కువగా ఈ డయాబెటిస్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఒకసారి ఈ వ్యాధి సోకింది అంటే జీవితాంతం ఇష్టమైన ఆహారానికి దూరం అవ్వాల్సిందే అని చాలామంది తెగ ఇబ్బంది పడుతున్నారు. ఇక ఆధునిక జీవన శైలి కారణంగా వస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. ముఖ్యంగా కొన్ని ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే ఈ ప్రాణాంతకమైన డయాబెటిస్ ను కూడా తగ్గించుకోవచ్చు అని సలహా ఇస్తున్నారు. ఇక ఆధునిక జీవనశైలి .. ఆహారపు అలవాట్ల కారణంగా మధుమేహం ఒక పెను సమస్యగా మారుతుంది.

ఇంతటి ప్రాణాంతకమైన వ్యాధిని దూరం చేసుకోవాలంటే మీరు తీసుకునే అల్పాహారంపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే మనం తీసుకునే ఆల్పారంలో ఉండే పోషకాలు వల్ల రోజు అంతా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఇక ఉదయం వేళల్లో ఇన్సులిన్ స్థాయి కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ దీనిని నియంత్రిస్తుంది. అలాంటప్పుడు బ్లడ్ షుగర్ స్థాయి తగ్గాలి అంటే కొన్ని ఆహారపు అలవాట్లు ప్రత్యేకంగా పాటించాలి. ముఖ్యంగా రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించే ఆ అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ ఏమిటి అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

చాలామంది ఎంతో ఇష్టంగా తిని ఎగ్ ఆమ్లెట్లో కొన్ని రకాల కూరగాయలను మిక్స్ చేసి తింటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక దీని వల్ల శరీరానికి పోషక పదార్థాలతో పాటు ఫైబర్ కూడా పుష్కలంగా అందుతుంది. ముఖ్యంగా మీరు తినే ఆహారం వృధా కాదు. అల్పాహారంలో మధుమేహా వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ప్రొటీన్లు లేదా అధికంగా ఫైబర్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇవే కాకుండా ఓట్స్ , బాదం, చియా సీడ్స్ , వెనిల్లా ఎక్స్ట్రాక్ట్, తేనె వంటివి అన్ని ఒక బౌల్లో వేసుకొని రాత్రంతా ఫ్రిజ్లో ఉంచాలి .ఉదయం అల్పాహారంగా ఈ మిశ్రమాన్ని తీసుకుంటే డయాబెటిస్ రోగులకు అత్యంత సురక్షితం అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news