Womens World Cup : రాణించిన భార‌త బ్యాట‌ర్లు.. ఆస్ట్రేలియా టార్గెట్ 278

-

ఐసీసీ ఉమెన్స్ ప్ర‌పంచ క‌ప్ లో భాగంగా నేడు భార‌త ఉమెన్స్ జ‌ట్టు, ఆస్ట్రేలియా ఉమెన్స్ జ‌ట్టుతో త‌లప‌డుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా మొద‌ట బౌలింగ్ ను ఎంచుకుంది. దీంతో భార‌త ఉమెన్స్ జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేశారు. కాగ భార‌త బ్యాట‌ర్లు స‌మిష్టిగా రాణించి.. నిర్ణిత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు న‌ష్టపోయి.. 277 ప‌రుగులు రాబ‌ట్టారు. కాగ ఈ మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త ఉమెన్స్ జట్టు ఆదిలోనే ఎదురు దెబ్బ త‌గిలింది.

సూప‌ర్ ఫామ్ లో ఉన్న ఓపెన‌ర్లు స్మృతి మందాన (10), షెఫాలి వ‌ర్మ (12) పరుగుల‌కే పెవిలియ‌న్ బాట పట్టారు. త‌ర్వాత బ్యాటింగ్ కు వ‌చ్చిన యంస్తిక బాటియా (59), కెప్టెన్ మిథిలి రాజ్ (68), హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ (57 నాటౌట్) రాణించారు. ఈ ముగ్గ‌రు నిల‌క‌డ‌గా రాణించి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు. చివ‌ర్లో వచ్చిన పూజా వ‌స్త్రాక‌ర్ కేవ‌లం 28 బంతుల్లో 34 ప‌రుగులు చేసింది.

దీంతో భార‌త ఉమెన్స్ జ‌ట్టు 277 ప‌రుగులు చేసింది. కాగ ఆస్ట్రేలియా బౌల‌ర్లు.. డార్సీ బ్రౌన్ 3 వికెట్లు ప‌డ‌గొట్టింది. అలాగే అలాన కింగ్ 2 వికెట్లు, జెస్ జొనాసెన్ ఒక వికెట్ తీసుకున్నారు. దీంతో భార‌త్ 7 వికెట్లు కోల్పోయి 277 ప‌రుగుల చేసింది. కాగ ఆస్ట్రేలియా విజ‌యం సాధించాలంటే.. 278 ప‌రుగుల చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news