ఫ్యాక్ట్ చెక్: కేంద్రం సామాన్యులకి రూ.5,000 ఇస్తోందా..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు.

వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.  సామాన్యులకు రూ.5,000 ఆర్థిక సాయం మోడీ ప్రభుత్వం ఇస్తున్నట్టు వుంది. అయితే మరి నిజంగా సామాన్యులకు రూ.5,000 ఆర్థిక సాయం మోడీ ప్రభుత్వం ఇస్తోంది..? ఇందులో నిజం ఎంత అనేది చూస్తే..

రూ.5,000 ఆర్థిక సాయం మోడీ ప్రభుత్వం ఇస్తోందని వచ్చిన వార్త నిజం కాదు. ఇది వట్టి ఫేక్ వార్త మాత్రమే. ఇందులో ఏమి నిజం లేదు. కనుక అనవసరంగా ఫేక్ వార్తలను నమ్మకండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీని పై స్పందించింది. ఇది వట్టి ఫేక్ వార్త అని తేల్చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news