పూజల నెపంతో.. యువతిపై లైంగిక వాంఛ తీర్చకున్న దొంగ బాబా..

-

నేటి సమజంలో అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయి. ఎక్కడ చూసిన చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిపైనా కామాంధులు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. సందు దొరికితే చాలు.. స్త్రీలపై పడి తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఇంట్లో సమస్యలు ఉన్నాయని మీ సమస్యలను తీర్చుతానంటూ ఓ దొంగ బాబా యువతిని నగ్నంగా చేసి పూజల పేరుతో శారీరక వాంఛ తీర్చకున్నాడు. వివరాల్లోకి వెళితే.. సదరు పూజారి పేరు నరేష్. హిసార్‌లోని ఆజాద్‌ నగర్‌లో స్థలం కొన్న నరేష్.. అక్కడ ఇంటి నిర్మాణం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆజాద్ నగర్ వచ్చినప్పుడు బాధితురాలి ఇంటికి వచ్చేశాడు. ఆ కుటుంబంలో భర్త సీఆర్‌పీఎఫ్ జవానుగా వేరే రాష్ట్రంలో పని చేస్తున్నాడు.

ఈ క్రమంలో తల్లీకూతుళ్లను దగ్గరలోని ఆలయానికి తీసుకెళ్లిన అతను.. వారి జీవితాల్లో కొన్ని కష్టాలు ఉన్నాయని, అవి తొలగిపోవాలంటే పూజలు చేయాలని చెప్పాడు. ఈ కారణంతో ఆ ఇంటికి తరచూ వస్తూ.. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తను చేసిన పాడుపనిని వీడియో తీసి ఆమెను బ్లాక్‌మెయిల్ చేశాడు. అలాగే పూజల పేర్లు చెప్పి రూ.1.15 లక్షలు కాజేశాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. అలాగే కొన్ని నగలు కూడా తీసుకున్నట్లు వాపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు పూజారి నరేష్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news