ప్రగతి భవన్ ముందు కుటుంబం ఆత్మహత్యాయత్నం

-

ప్రగతి భవన్ ముందు కుటుంబంతో సహా ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. ఇబ్రహీం పట్నానికి చెందిన ఐలేష్ అనే వ్యక్తిగా అతనిని గుర్తించారు. ప్రగతి భవన్ ముందు కిరోసిన్ పోసుకుని అంటించుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. తన భూమికి నష్టపరిహారం ఇప్పించాలంటూ ఇబ్రహీంపట్నం కి చెందిన ఐలేష్ ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీం పట్నానికి చెందిన ఐలేష్ కి చెందిన భూమిని ప్రభుత్వం తీసుకొని నష్టపరిహారం చెల్లించలేదని.. ఈ విషయమై ఎంతమంది అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని అన్నారు. దీంతో తన ఆవేదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో బాధితుడు నేడు ప్రగతి భవన్ కి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రగతిభవన్ వద్ద ఈ ఘటనకి పాల్పడ్డాడు.

Read more RELATED
Recommended to you

Latest news