రైతులు బాగుప‌డాలంటే ఈ దుర్మార్గ‌మైన పాల‌న పోవాలి – సీఎం కేసీఆర్

-

దేశ వ్యాప్తం గా రైతులు బాగు ప‌డాలంటే దుర్మార్గ మైన బీజేపీ పాల‌న పోవాల‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్రం లో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం రైతు వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను తీసుకుంటుంద‌ని అన్నారు. ఇది పోవాలంటే కేంద్రం లో బీజేపీ పోవాల‌ని అన్నారు. రైతు ల తో పాటు మ‌హిళ‌లు, విద్యార్థులు, వ్యాపార వేత్త‌లు బాగు ప‌డాలంటే బీజేపీ ని త‌రిమి కోట్టాల‌ని అన్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం త‌ప్పు చేసి దేశ వ్యాప్తం గా రైతు ల‌కు క్ష‌మాప‌ణ లు చెప్పార‌ని గుర్తు చేశారు. అలాగే రైతు ఉద్యమం లో 700 మంది రైతుల ప్రాణా ల‌ను పొట్టన పెట్టుకుంది ఎవర‌ని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించాడు. అలాగే రైతుల కు శాపం గా మ‌రో చ‌ట్టాన్ని తీసుకువ‌స్తున్నారని అన్నారు. ఈ చ‌ట్టం ద్వారా ప్ర‌తి రైతు మెడ మీద క‌త్తి పెట్టి మ‌రి మీట‌ర్ పెట్టి విద్యుత్ ఛార్జీ ల‌ను వ‌సూల్ చేస్తార‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news