టాలీవుడ్ కు బిగ్ షాక్.. ఇక ఏపీ థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ !

-

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల నుంచి ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు రెట్టింపు అయ్యాయి. దీంతో చాలా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ తో పాటు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రం సండే లాక్ డౌన్ లు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లోని జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నైట్ కర్ఫ్యూలు విధించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను విధించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

అలాగే ఆంధ్రప్రదేశ్లోని థియేటర్లలో… 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరికాసేపట్లో నే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 50 శాతం ఆక్యుపెన్సీ తో.. టాలీవుడ్ లోని పెద్ద సినిమాలకు… షాక్ తగిలింది. ఇప్పటికే టిక్కెట్ల ధరల పై జగన్ సర్కార్, టాలీవుడ్ మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news