బర్త్‌ డే వేడుకలో భారీ అగ్నిప్రమాదం.. 21మంది మృతి

-

గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరంలో పెను విషాదం జరిగింది. ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబ సభ్యులంతా బర్త్‌ డే వేడుకలో ఉండగా.. భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ఉన్నారు. గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరంలో పెను విషాదం జరిగింది. ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబ సభ్యులంతా బర్త్‌ డే వేడుకల సందడిలో ఉండగా.. ఆ క్షణంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదానికి ఓ కుటుంబమే బలైపోయింది. అపార్ట్‌మెట్‌లో పెద్ద ఎత్తున ఎగసిపడిన అగ్నికీలల ధాటికి 21మంది బలైపోగా.. వీరిలో 17మంది ఒకే కుటుంబానికి చెందినవారు ఉండటం అందరినీ హృదయాలను కలిచివేస్తోంది.

Fire Images - Free Download on Freepik

జబాలియా శరణార్థుల శిబిరం ప్రాంతంలో గురువారం రాత్రి ఓ మూడంతస్తుల భవనంలోని పైఅంతస్తులో అగ్నిప్రమాదం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. అయితే, ఇంట్లో నిల్వ చేసిన పెట్రోల్‌ వల్లే ప్రమాదం చోటుచేసుకొని ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఈ పెట్రోల్‌ ఎలా మండిందనే అంశంపై మాత్రం స్పష్టత లేదని.. దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news