పౌరసరఫరాల శాఖ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

-

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టెక్స్‌టైల్ పార్కు వద్ద ఉన్న పౌరసరఫరాల శాఖ గోదాంలో మంటలు చెలరేగాయి. ఈ గోదాంలో రేషన్ బియ్యం నిల్వ చేశారు.

గోదాం సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న రెండు ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి. భారీగా నష్టం జరిగే అవకాశం ఉందని గోదాం సిబ్బంది పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. స్థానికంగా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news