నెల్లూరు జిల్లాలో గ్యాస్ లీక్.. ముగ్గురు దుర్మరణం

-

నెల్లూరు: వింజమూరు మండలం చంద్రపడియాలో గ్యాస్ లీక్ అయి ముగ్గురు దుర్మరణం చెందారు. వెంకటనారాయణ యాక్టివ్ ఇంగ్రిడియంట్స్‌లో రియాక్టర్ లోనికి వెళ్లే గ్యాస్ పైప్ లీక్ అయింది. దీంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మరికొంతమందికి గాయాలయినట్లు తెలుస్తోంది. కంపెనీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మృతుల కుటుంబాల ఆర్తనాదాలతో మోర్మోగిపోతోంది. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని అంటున్నారు. అయితే గత ఏడాది ఇదే ఫ్యాక్టరీ‌లో రియాక్టర్ పేలి ముగ్గురు మృతి చెందారు. తాజాగా మరో ఘటన జరగడంపై అధికారారులు సీరియస్ అయ్యారు. సంఘటన స్థలానికి అధికారులు చేరుకున్నారు.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో మరణాల శాతంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనాతో కాకుండా ప్రమాదాల వల్ల కూడా ప్రజలు చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇటీవల కడపలో పేలుళ్లు జరిగి 10 మందికి పైగా చనిపోయారు. సోమవారం తిరుపతి రుయా ఆస్పత్రిలో 11 మందికి పైగా మృతి చెందారు. దీంతో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news