2023 వ ఏడాదిలో తొలి బుధ ప్రదోష వ్రతం..ప్రాముఖ్యతలు..

-

ఈ ప్రదోష వ్రతం అనేది మన హిందువులకు చాలా ముఖ్యమైనది.. ఎవరైతే ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో చేస్తారొ వారికి శివయ్య అనుగ్రహం వుంటుందని పండితులు చెబుతున్నారు.ఎన్నో బాధలు,పాపాలను కూడా ఈ వ్రతం దూరం చేస్తుందని కూడా నమ్ముతారు. 2023వ సంవత్సరం మొదటి ప్రదోష వ్రతం జనవరి 4న పౌరుషమాసం శుక్లపక్షంలోని త్రయోదశి తిధిగా జరుపుకుంటారు..

ఈ సంవత్సరం మొదటి ప్రదోష వ్రతం అంటే 2023 పౌష మాసంలో త్రయోదశి రోజున జరుపుకునే అవకాశం ఉంది. ఇది జనవరి 3:01 నిమిషానికి మొదలై జనవరి 4 రాత్రి 11:50 నిమిషములకు ముగిసే అవకాశం ఉంది. ప్రదోష పూజా వ్రతం ఆధారంగా జనవరి 4 2023 వ తేదీన బుధ ప్రదోష వ్రతన్ని ప్రజలు ఆచరిస్తారు..వ్రతం మొదలు సమయం 5.37 నిమిషాలు..నుంచి ఎనిమిది గంటల 21 నిమిషంలో వరకు ఉంటుంది. ఈ రోజున అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:13 నిమిషముల నుంచి 12.05 నిమిషముల వరకు ఉంటుంది. అలాగే సర్వార్థ సిద్ది యోగం రోజంతా ఉండే అవకాశం ఉంది.

ఈరోజు ముఖ్యంగా ఏం చెయ్యాలంటే..ప్రదోష వ్రతం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించాలి. ఆ తర్వాత అక్షర, గంగాజల్ మొదలైన వాటితో శివుడిని పూజించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయానికి ముందు మళ్ళీ స్నానం చేసి తెల్ల బట్టలు ధరించాలి..

ఆ తర్వాత పవిత్రమైన నీటితో పాటు గంగాజలంతో పూజా స్థలాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇలా ఆవు పేడను తీసుకుని దానీ సహాయంతో మండపాన్ని సిద్ధం చేసుకోవాలి. ఐదు రకాల రంగులు సాయంతో మండపం లో రంగొలిని తయారు చేసుకోవాలి. ఆ తరువాత శివుని ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని జపించి నీటి శివునికి నీటిని సమర్పించాలి..

బుధ ప్రదోష వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎలాంటి రోగాలైన దూరం చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల దోషాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రదోష వ్రతం సంతానం కలగడానికి ముఖ్యమైన వ్రతం..భక్తితో ఈ వ్రతం చెయ్యడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగి పోతాయి..ఆయురారోగ్యాలతో ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news