ఫుట్ బాల్ ప్లేయర్ ఆకాశ్ దారుణ హత్య !

-

విజయవాడలోని గురు నానక్ కాలనీ లో దారుణం చోటుచేసుకుంది.జక్కంపాడుకి చెందిన ఫుట్ బాల్ ప్లేయర్ ఆకాశ్ దారుణ హత్యకు గురయ్యారు.ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. నిందితులు కత్తులతో పొడిచి చంపేసినట్లు గా తెలుస్తోంది. నిందితులు గుణదల గంగిరెడ్డి దిబ్బకు చెందిన వారిగా గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఆకాశ్ హత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. హత్యకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు పోలీసులు. అయితే గత రెండు రోజుల క్రితం ఒక రౌడీషీటర్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. అతని అంత్యక్రియలు జరిగే సమయంలో ఆకాశ్, పూర్ణ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘర్షణ గల వివాదమే హత్యకు కారణమై ఉండొచ్చని స్థానిక సమాచారం. ఈ హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news