టీడీపీలో విషాదం.. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మృతి…

-

తెలుగు దేశం పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీడీపీ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మృతి చెందారు. తాజాగా ఆయనకు గుండె పోటు రావడంతో… మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మృతి చెందారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వయసు 73 సంవత్సరాలు. గత కొన్ని రోజుల నుంచి.. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా గుండె పోటు రావడంతో.. బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మృతి చెందారు. కాసేపటి క్రితం అపోలో ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూసిన బొజ్జల… చంద్రబాబు హయాంలో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. అలిపిరి బాంబుపేలుడు ఘటనలో చంద్రబాబుతో పాటు గాయపడిన బొజ్జల… ఇటీవల బొజ్జలను పరామర్శించారు మాజీ సీఎం చంద్రబాబు. బొజ్జల ఆకస్మిక మృతికి పలువురు టీడీపీ నేతలు సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news