వివేకా హత్య పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి

-

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య పై కడప జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య ను రాజకీయ లబ్ది కోసం వాడుకున్నారని ఆయన ఆరోపించారు. కోడి కత్తి మాదిరిగానే వివేకా హత్య కేసును రాజకీయ లబ్ది కోసం వినియోగించుకున్నారని వ్యాఖ్యానించారు.

ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు హత్యతో సంబంధం ఉందని ఆయన మరింత కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న ను చంపిన విషయం జగన్ కు, వారి బంధువులకు తెలుసునని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రంలో కొనసాగుతున్న వైసీపీ పాలన పైన డీఎల్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రివర్స్ పాలన కొనసాగుతోందని ఆయన ధ్వజమెత్తారు. వివేకా హత్య కేసును కూడా రివర్స్ పాలనలోనే నడిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news