సంజయ్ కబర్దార్..ఎక్కువ చేస్తే బండి మిగలదు, గుండు మిగలదు – రేణుక చౌదరి

-

సంజయ్ కబర్దార్..ఎక్కువ చేస్తే బండి మిగలదు, గుండు మిగలదని రేణుక చౌదరి ఫైర్ అయ్యారు. సోనియా గాంధీ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారని.. బీజేపీ జంట నగరాల్లో మత చిచ్చు రగల్చాలి అనుకుంటే అది బ్రమ అని.. చార్మినార్ ఒక మతానికి ధర్మానికి సంబంధించినది కాదని ఫైర్ అయ్యారు.

అది హైదరాబద్ ప్రజలది..నేను ఒంటరిగా చార్మినార్ వస్తా…దమ్ముంటే రా తేల్చుకుందామని సవాల్ విసిరారు. బీజేపీ పిచ్చి ప్రయత్నాలకు మేము బెదరమని.. మా దమ్ము ఏంటో చుపుతామని హెచ్చరించారు. ఎక్కువ చేస్తే బండి మిగలదు, గుండు మిగలదు.. సంజయ్ కబర్దార్.. అని వార్నింగ్ ఇచ్చారు. కేసిఆర్ ను చూస్తే జాలి వేస్తోంది..తెలంగాణకు అన్యాయం కేసిఆర్ కు ఇవ్వాల గుర్తు కు వచ్చిందా? అని నిలదీశారు. కాంగ్రెస్ లో కోవర్ట్ లకు టైం దగ్గర పడిందని తెలిపారు రేణుక చౌదరి.

Read more RELATED
Recommended to you

Latest news