కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ అయిన మాజీ ఎంపీ వివేక్, ఈటెల రాజేందర్

-

గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్తలకు మరింత ఊతం ఇచ్చేలా నేడు రాజగోపాల్ రెడ్డి ఇంట్లో భేటీ అయ్యారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. దీంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. నిజానికి గతంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారని ప్రచారం జోరుగా జరిగింది.

తెలంగాణ లో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం బీజేపీ నే అంటూ గతంలో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో.. ఆయన కమలం గూటికి చేరడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కాంగ్రెస్ లో ఉంటూనే బిజెపికి మద్దతుగా కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో పార్టీ నుండి సోకాజ్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. కానీ కొన్నాళ్ళకి ఆ వ్యవహారం మరుగున పడింది. తాజా పరిణామాలతో,బీజేపీ నేతలతో భేటీ అనంతరం ఆయన బీజేపీలో చేరతారా? లేదా? అన్నది వేచి చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news