మొటిమలు తగ్గడం లేదని యువతి ఆత్మహత్య..!!

-

ఇటీవల కాలంలో చాలా మంది యువతి యువకులు చాలా సిల్లీ రీజన్స్ తో ప్రాణాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో తీసుకుంటున్న ఆ నిర్ణయం నిండు ప్రాణాలను బలి తీసుకుంటోంది. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ముఖంపై మొటిమలు తగ్గడం లేదని.. మనస్తాపానికి గురై ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లా బిసంద పోలీస్ స్టేషన్ పరిధిలోని అజిత్‌పారా గ్రామంలో జరిగింది.

యువతి-ఆత్మహత్య
యువతి-ఆత్మహత్య

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొటిమల సమస్యతో యువతి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఇటీవల తనకు పెళ్లి సంబంధాలు చూశారని, ఆ అబ్బాయికి పెళ్లి కూతురు నచ్చలేదని తెలిపారు. పెళ్లికూతురు ముఖంపై మొటిమలు ఉన్నాయని రిజెక్ట్ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి తరలించామన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news