మరోసారి సబితా గెలువదు..కేసీఆర్‌ తో మాట్లాడతా -తీగల సంచలనం

-

మరోసారి మంత్రి సబితా ఇంద్రారెడ్డి గెలువదు..కేసీఆర్‌ తో మాట్లాడతానంటూ తీగల కృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం టీఆర్ఎస్ లో నేతల మధ్య మాటల యుద్ధం..ముదిరింది. ఇన్నాళ్లు నివురు కప్పిన నిప్పులా విబేధాలు ఉండగా.. తాజాగా బయట పడ్డాయి.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై టీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. మీర్ పేటను మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాశనం చేస్తున్నారు. నేను చూస్తూ ఊరుకోను…ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంక్ లైన్ పనులు ఇంకా పూర్తి చెయ్యలేదు… చెరువులు, స్కూల్ జాగాలను వదలడం లేదని నిప్పులు చెరిగారు తీగల కృష్ణా రెడ్డి. మా పార్టీనుండి సబిత ఎమ్మెల్యేగా గెలువలేదు….సీఎంతో మాట్లాడుతానంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు తీగల కృష్ణా రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news