తెలుగు అకాడమీ కేసులో మరో నలుగురు అరెస్ట్ !

-

తెలుగు అకాడమీ కేసు లో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు ను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యం లోనే తెలుగు అకాడమీ కేసులో ఇవాళ మరో నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్నారు సీపీఎస్‌ పోలీసులు. ఇక ఇప్పటికే యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ ని మూడు రోజుల పాటు విచారించారు సీపీఎస్‌ పోలీసులు.ఇదే కేసు లో అరెస్ట్ అయిన ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్య నారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దిన్ లను నేడు కస్టడీ లోకి తీసుకోనున్నారు పోలీసులు.

ముగ్గురు నిందితులను 4 రోజుల కస్టడీ కి అనుమతించింది నాంపల్లి కోర్టు. దీంతో ఈ రోజు నుంచి 4 రోజుల కస్టడీ లోకి తీసుకోనున్నారు పోలీసులు. మస్తాన్ వలీని 4 వ రోజు కస్టడీలో తీసుకొని ఈ కేసుపై పోలీసులు అతన్ని ప్రశ్నించనున్నారు. అలాగే… మరి కొంత మంది నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టును పోలీసులు అనుమతి కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. తద్వారా ఈ కేసులో నిందితులు కొట్టేసిన డబ్బుపై కూపి లాగనున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news