నోయిడాలో గోడ కూలి నలుగురు మృతి

-

ఉత్తర్ ప్రదేశ్​లోని నోయిడాలో ఘోర ప్రమాదం జరిగింది. నోయిడాలోని ఓ హౌసింగ్ సొసైటీ గోడ కూలింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో 12 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. చాలా సేపు శ్రమించి వీరిని సురక్షితంగా బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. జల్ వాయు విహార్ సెక్టార్ 21లో ఇవాళ ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు వెల్లడించారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, పోలీసు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఉదయం నుంచి సహాయక చర్యలు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 12 మందిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాదానికి గల కారణాలను అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు సంయుక్తంగా ఆరా తీస్తున్నారు. ఇటీవల గోడ కూలి 13 మంది మరణించిన ఘటన మరవక ముందే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం స్థానికంగా కలవరం సృష్టిస్తోంది. ఘటనపై మరిన్ని వివరాలు పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత వెల్లడిస్తామని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news