గజ్వేల్ లోనే పోటీ చేస్తా.. కెసిఆర్ ని ఓడిస్తా – ఈటెల రాజేందర్

-

హుజరాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. శనివారం మీడియాతో నిర్వహించిన మాటామంతి లో మాట్లాడుతూ.. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఇందుకోసం ఇప్పటి నుంచే గజ్వేల్ లో సీరియస్ గా వర్క్ చేస్తున్నాం అని తెలిపారు. సీఎం కేసీఆర్ ను ఓడించాలని అవసరం ఎంతైనా ఉందని, బెంగాల్లో బిజెపి నేత సువేందు అధికారి సీన్ ఇక్కడ రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు.

బెంగాల్ మాదిరిగా ముఖ్యమంత్రిని ఇక్కడ కూడా కొట్టాలన్నారు ఈటెల రాజేందర్. కాగా గతంలో టిఆర్ఎస్ పార్టీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని పార్టీ నుండి బహిష్కరణకు గురై బిజెపి తీర్థం పుచ్చుకొని హుజురాబాద్ నుండి బై ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news