మళ్లీ బీజేపీలోకి వెళ్లనున్న గాలి జనార్దన్ రెడ్డి

-

బళ్లారి లోని ఐరన్ ఓర్ మైనింగ్ యజమాని అయిన గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ బీజేపీలోకి వస్తున్నారంటూ వార్త. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కూడా జనార్దన్ రెడ్డి తిరిగి బీజేపీలోకి వస్తారనే నమ్మకం తనకు ఉందని తాజాగా వెల్లడించడం కాస్త చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలా ఉంటే, గాలి జనార్దన్ రెడ్డి మాత్రం దీనికి స్పందిస్తూ ఇటువంటి ప్రచారాలను పూర్తిగ ఖండించడం జరిగింది. ఈ వార్తల్లో ఏ మాత్రం కూడా నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. తాను వెనకడుగు వేయనని, బోనులో ఉన్నా కూడా పులి పులే అని అన్నారు ఆయన.

ఇతరులకు షాక్ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. విదేశాల్లో తనకు డబ్బు ఉందని చెపుతున్నారని… ఆ సొమ్మును కనిపెట్టేందుకు ఏజెన్సీలకు ఎన్ని రోజులు పడుతుందని అడిగారు గాలి జనార్దన్ రెడ్డి. విదేశాల్లో ఉందని చెపుతున్న డబ్బును తెస్తే… దాన్ని ప్రజలకే పంచి పెడతానని అన్నారు. తాను స్థాపించిన పార్టీలోకి ఇతర నేతలు చేరకుండా చేసేందుకే తాను బీజేపీలోకి వస్తున్నాననే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త పార్టీతో తాను ముందుకు వెళ్లకుండా లొంగదీసుకోవచ్చని ఎవరైనా భావిస్తే అది వారి పొరపాటే అవుతుందని వ్యక్తపరిచారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version