షారూఖ్‌ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్‌.

-

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్..నాలుగేళ్ల కిందట ‘జీరో’ చిత్రంలో ప్రేక్షకులకు చివరగా కనిపించారు. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ..వరుస మూవీల షూటింగ్స్ లో షారుఖ్ ఫుల్ బిజీగా ఉన్నారు. తమిళ్ డైరెక్టర్ అట్లీతో ‘జవాన్’ పిక్చర్ చేస్తున్న షారుఖ్..ఆ సినిమా అప్ డేట్ ఇచ్చేశాడు. వచ్చే ఏడాది జూన్ 2న పాన్ ఇండియా ఫిల్మ్ గా అన్ని భాషల్లో ఆ సినిమా విడుదల కాబోతున్నట్లు తెలిపాడు.

ఈ క్రమంలోనే తాజాగా మరో సినిమా ‘‘పఠాన్’’ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు. ఇది ఇలా ఉండగా బాలీవుడ్ బాదుషా షారుక్ ఖాన్ తన ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టించి మతసామరస్యాన్ని ఘనంగా చాటారు. బుధవారం వినాయక చవితి సందర్భంగా గణేష్ ప్రతిమను ప్రతిష్టించి, పూజలు జరిపారు. దీనికి సంబంధించిన ఫోటోను షారుక్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ, ‘గణపతిజి, నన్ను, నా లిటిల్ వన్ ను ఇంట్లోకి ఆహ్వానించారు.

కృషి, పట్టుదలతో పాటు దేవుడిపై నమ్మకంతో మీరు అనుకున్నది సాధించవచ్చు. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు’ అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం షారుక్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన గణపతి ఫోటో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే కొన్ని లక్షల మంది లైక్ చేశారు. ఇక సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉండే షారుక్ ఖాన్ అన్ని పండుగల సమయంలో తన అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news