గాంధీ ఆస్పత్రిలో నేడు కేసీఆర్ చేతుల మీదుగా గాంధీ విగ్రహం ఆవిష్కరణ

-

నేడు గాంధీ జయంతి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌ మరో మహోత్తరమైన కార్యక్రమానికి నాంది పలకనున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఇవాళ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం కేసీఆర్‌. ఈ నేపథ్యంలోనే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరణ అనంతరం.. బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసగించనున్నారు.

ఇక ఇది ఇలా ఉండగా.. గాంధీ జయంతి నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు చెప్పారు. హక్కుల సాధన కోసం ముందు ప్రార్థించడం,అభ్యర్థించడం, ఆ తరువాత నిరసన ప్రకటించి ఉద్యమించడం అనే ప్రజాస్వామిక పంథా ద్వారా, దేశ ప్రజలను దేశ స్వాతంత్ర్యోద్యమంలో లక్ష్య సాధన దిశగా కార్యోన్ముఖులను చేసిన జాతిపిత మహాత్మా గాంధీ జీవితం అందరికీ అన్ని కాలాలకూ ఆదర్శనీయమైనదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు ఘన నివాళులర్పించారు.గాంధీజీ జాతికి అందించిన స్పూర్తిని సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news