ఒడిశాలో దారుణ.. కాల కృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన వివాహితపై గ్యాంగ్ రేప్

-

దేశంలో ప్రతీ రోజూ ఎక్కడోచోట అత్యాచారాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చిన్న పెద్దా తేడా లేకుండా వావీ వరసలు మరిచి కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్భయ, దిశ వంటి చట్టాలు తెచ్చినా… కామాంధుల్లో మార్పు రావడం లేదు. తాజాగా ఒడిశా రాష్ట్రంలో మరో ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ఒడిశా నిమపరా ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల ఓ వివాహితపై నలుగురు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. శనివారం రాత్రి బహిర్భూమికి సమీపంలోని నది దగ్గరకు ఒంటరిగా వెళ్లిన విహాహితపై దారుణానికి ఒడిగట్టారు. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వారే అత్యాచారానికి పాల్పడ్డారు.

అత్యాచారం

ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంత కంగారు పడ్డ భర్త, కుటుంబ సభ్యులతో భార్యను వెతకడానికి వెళ్లారు. కాగా అక్కడే ఒడ్డుపై కూర్చుని ఏడుస్తున్న భార్యను గమనించగా.. కుటుంబ సభ్యులకు జరిగిన ఘటన గురించి చెప్పింది. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితురాలు నిందులపై కేసు నమోదు చేసింది. నిందితులు.. బలరాం భోయి, అతని సహచరులు కన్హయి భోయి, బిద్యాధర్‌, అజిత్‌ దాస్‌గా పోలీసులు గుర్తించారు. నలుగురు నిందితులను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో త్వరితగతిన చర్యలు తీసుకుంటామని పూరీ ఎస్పీ కన్వర్ విశాల్ సింగ్ హామీ ఇచ్చారు. నిందితులపై 30 రోజుల్లోగా చార్జిషీట్‌ను ఫైల్‌ చేసి కోర్టులో సమర్పిస్తామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news