తమిళనాడులో దారుణం… బాయ్ ఫ్రెండ్ ఎదుటే యువతిపై సామూహిక అత్యాచారం

-

దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా… అత్యాచారాలకు అడ్డుకట్టపడటం లేదు. యువతులు, మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సంఘటనల్లో నేరం ఎక్కడ బయటకు వస్తుందో అని మహిళలను దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా తమిళనాడులో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. బాయ్ ఫ్రెండ్ కళ్లముందరే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు దుర్మార్గులు. వీరిని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే… కడలూరులోని కమ్మయమ్ పెట్టాయ్ కి చెందిన బాధిత యువతి, తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లింది. ఏకాంతంగా గడుపుతున్న వీరి ఫోటోలు, వీడియోలు తీసిన ముగ్గరు వ్యక్తులు ఆ జంటను బెదిరించారు. అలా బాయ్ ఫ్రెండ్ ఎదుటే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతే కాకుండా బాయ్ ఫ్రెండ్ సెల్ ఫోన్ లాక్కున్నారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి అక్కడ నుంచి పరారయ్యారు.

ఇదిలా ఉంటే కమ్మియమ్ పెట్టాయ్ లో మార్చి 28న రాత్రిపూట ఒంటరిగా బస్ స్టాప్ లో ఉన్న యువతిని.. గస్తీలో ఉన్న పోలీసులు ప్రశ్నించగా.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వెంటనే బాధిత యువతిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు గాలింపు చేపట్టి ముగ్గురు నిందితులు కిశోర్(19), సతీశ్(19), ఆరిఫ్​(18)ను అరెస్ట్ చేశారు. నిందితుల మొబైల్​ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితులను విచారిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news